vajpayee: వాజ్ పేయీ ఆరోగ్య పరిస్థితి విషమం.. పరామర్శించిన ప్రధాని మోదీ!

  • ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయీ
  • వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న మోదీ
  • వాజ్ పేయీకి అమిత్ షా పరామర్శ

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పరామర్శించారు. వాజ్ పేయీ ఆరోగ్య పరిస్థితి గురించి, ఆయనకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. వాజ్ పేయీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పరామర్శించారు.  

కాగా, కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వాజ్ పేయీ   చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఇటీవల చేరారు. ఆయన ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ కు చేరుకుంటున్నట్టు  పార్టీ వర్గాల సమాచారం.

అటల్ బిహారీ వాజ్ పేయీ ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని ఏపీ బీజేపీ శాఖ కూడా తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పేర్కొంది.ఈ కారణంగా రాజధాని అమరావతిలో రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయానికి రేపు జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని తెలిపింది.

  • Loading...

More Telugu News