Rahul Gandhi: టీకాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకిన రాహుల్ గాంధీ!

  • రాహుల్ తో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్లు
  • నేతలతో విడివిడిగా మాట్లాడిన రాహుల్
  • పార్టీ విజయం కోసం ఐక్యతగా పని చేయాలంటూ సూచన

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు క్లాస్ పీకారు. ఈ ఉదయం ఆయనతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఒక్కో నేతతో ఆయన విడివిడిగా మాట్లాడి, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.

అనంతరం రాహుల్ వారితో మాట్లాడుతూ, నేతలంతా విభేదాలను పక్కనపెట్టి, ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఈ భేటీ సందర్భంగా నేతల మధ్య సఖ్యత లేదనే విషయంపైనే రాహుల్ దృష్టి సారించినట్టు సమాచారం. ప్రతి నేతతో మాట్లాడుతూ, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ విజయం కోసం అందరూ ఐకమత్యంగా కలసి పని చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News