Hyderabad: హైదరాబాద్ లో ఎన్ఐఏ విచారణ.. ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్టు!

  • 20 మంది యువకులను విచారించిన ఎన్ఐఏ
  • అందులో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు
  • ఐసిస్ వ్యాప్తికి కీలకపాత్ర పోషిస్తున్న యువకులు

హైదరాబాద్ లో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు అరెస్టు చేసింది. బాలాపూర్ లోని షాయిన్ నగర్ లో ఎన్ఐఏ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఇరవై మంది యువకులను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

గత నాలుగు రోజులుగా వీరిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా మహ్మద్ అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాదిర్ లను విచారించారు. వీరిద్దరికీ ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఈరోజు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఐసిస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడం, ఆ ఉగ్రవాద సంస్థ వైపు యువకులను ఆకర్షించేలా చేయడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది.

  • Loading...

More Telugu News