chiranjeevi: గీతా ఆర్ట్స్ తదుపరి ప్రాజెక్టులు ఈ హీరోలతోనే?

  • గీతా ఆర్ట్స్ 2 నుంచి 'గీత గోవిందం'
  • నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో 
  • ఆల్రెడీ మొదలైన సన్నాహాలు

అల్లు అరవింద్ భారీ బడ్జెట్ చిత్రాలను గీతా ఆర్ట్స్ పై .. ఓ మాదిరి బడ్జెట్ చిత్రాలను గీతా ఆర్ట్స్ 2పై చేస్తూ వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తూ .. వరుస సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. అలా 'గీత గోవిందం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వరుసగా రెండు భారీ బడ్జెట్ సినిమాలు .. ఓ మాదిరి బడ్జెట్ లో ఒక సినిమా రూపొందనున్నట్టు సమాచారం.

ముందుగా ఈ బ్యానర్లో భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమాను నిర్మిస్తారట. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమాను చేయనున్నట్టు చెబుతున్నారు. ఆ వెంటనే చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. కొరటాల సినిమాను పూర్తి చేసిన తరువాత చిరంజీవి చేయబోయే సినిమా ఇదేనని అంటున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా .. అధికారికంగా ప్రకటించనున్నారట.    

  • Loading...

More Telugu News