Andhra Pradesh: కృష్ణా జిల్లా గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకదాన్నొకటి ఢీకొన్న మూడు బస్సులు, కారు!

  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన
  • ఓ బస్సు డ్రైవర్ మృతి
  • 25 మందికి గాయాలు

కృష్ణా జిల్లా గరికపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన మూడు బస్సులు, ఓ కారు  ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. కాగా, పెను ప్రమాదం జరిగినా భారీ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

  • Loading...

More Telugu News