Rajya Sabha: పీఏసీ సభ్యుడిగా సీఎం రమేశ్ ఎన్నిక!

  • రాజ్యసభ నుంచి పీఏసీ సభ్యులుగా ఇద్దరు ఎన్నిక
  • టీడీపీ నుంచి సీఎం రమేశ్
  • బీజేపీ నుంచి భూపేంద్ర యాదవ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. రాజ్యసభ నుంచి ఇద్దరిని పీఏసీ సభ్యులుగా ఎన్నుకోవడానికి పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికలో టీడీపీ నుంచి సీఎం రమేశ్, బీజేపీ నుంచి భూపేంద్ర యాదవ్ ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యులుగా సీఎం రమేశ్ 106 ఓట్లు, భూపేంద్ర యాదవ్ 69 ఓట్లు పొందారు. సీఎం రమేశ్ కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, అన్నా డీఎంకే పార్టీకి చెందిన సభ్యులు ఓటేశారు.

  • Loading...

More Telugu News