MS Dhoni: ధోనీతో అమిత్ షా భేటీ.. మద్దతు కోరిన బీజేపీ అధ్యక్షుడు!

  • సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ధోనీని కలిసిన అమిత్ షా
  • బీజేపీ విజయాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన బీజేపీ చీఫ్
  • రానున్న ఎన్నికల్లో మద్దతు పలకాలని విన్నపం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అయ్యారు. సంపర్క్ సే సమర్థన్ ప్రచార కార్యక్రమంలో భాగంలో ఆయన ఈ రోజు ఢిల్లీలో ధోనీని కలిశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, అభివృద్ధి కార్యక్రమాలను ధోనీకి అమిత్ షా వివరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలకాలని కోరారు.

2019 ఎన్నికల నేపథ్యంలో సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే. మే 29న ఈ కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను వ్యక్తిగతంగా కలుస్తూ... వారి మద్దతును బీజేపీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికే లతా మంగేష్కర్, కపిల్ దేవ్, రతన్ టాటా, మాధురీ దీక్షిత్ తదితరులను అమిత్ షా కలిశారు.

  • Loading...

More Telugu News