paruchuri: 'అజ్ఞాతవాసి'లో ఆ సీన్స్ అలా అనిపించాయి: పరుచూరి గోపాలకృష్ణ

  • కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టుగా అనిపించింది
  • త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు 
  • పవన్ మళ్లీ నటించాలి

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'అజ్ఞాతవాసి' సినిమాను గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమాలో సీఈవో పోస్టులు .. అందరూ రౌండ్ గా కూర్చుని మాట్లాడుకోవడాలు వంటి సీన్స్ వున్నాయి .. అదే తరహా సీన్స్ ను 'అజ్ఞాతవాసి'లో పెట్టడం వలన రిపిటేషన్స్ లా అనిపించాయి .. వాటిని ఎవైడ్ చేసుంటే బాగుండేది.

'అత్తారింటికి దారేది'లో మేనత్త దగ్గర హీరో ఎలాగైతే కన్నీళ్లు పెట్టాడో, అదే విధంగా ఈ సినిమాలో ఖుష్బూ పాత్ర దగ్గర కన్నీళ్లు పెడతాడు. 'అబ్బా మళ్లీ అలాంటి సీనే' అనిపిస్తుంది. పవన్ తో అంతకుముందు చేసిన సినిమాల్లోని సన్నివేశాలకు దగ్గరగా లేకుండా చూసుకోవలసింది. ఇక మరొక విషయం ఏమిటంటే ప్రతీకారం తీర్చుకోవాల్సిన హీరో .. అందుకు సంబంధించిన వాళ్లందరినీ అలాగే వదిలేసినట్టుగా అనిపించింది. ఏదేమైనా త్రివిక్రమ్ గొప్ప దర్శకుడు .. పవన్ మంచి నటుడు అనడంలో సందేహం లేదు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని నేను కోరుకుంటున్నాను .. ఎందుకంటే నేనూ ఆయన అభిమానినే" అని చెప్పుకొచ్చారు.       

  • Loading...

More Telugu News