basava tarakam: ‘బసవతారకం మదర్ కిట్స్’పై చంద్రబాబు సంతృప్తి!

  • ఏపీలో బాలింతలకు ఇకపై ‘బసవతారకం మదర్ కిట్స్’
  • మదర్ కిట్స్ లో వస్తువుల నాణ్యతపై బాబు సంతృప్తి
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించాలి: సీఎం

ఏపీలో బాలింతలకు ఇక నుంచి ‘బసవతారకం మదర్ కిట్స్’ పంపిణీ చేయనున్నారు. ఈ కిట్స్ ను ఈ రోజు సీఎం చంద్రబాబు పరిశీలించారు. వీటిలోని వస్తువుల నాణ్యతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కాగా, ప్రతి కిట్ లో ఓ చీర, జాకెట్, దుప్పటి, ఫ్లాస్క్, రెండు స్కార్ఫ్ లు, ఇరవై నాప్ కిన్స్ ఉంటాయి. ఈ కిట్ లో వస్తువుల విలువ రూ.1040. ప్రతి ఏటా 3.60 లక్షల మంది బాలింతలకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. మదర్ కిట్స్ పంపిణీకి ఏడాదికి రూ.26 కోట్ల బడ్జెట్ కేటాయించారు. 

  • Loading...

More Telugu News