amaravathi: అమరావతిలో మరో 10 ఐటీ కంపెనీలు ప్రారంభం

  • ఐటీ కంపెనీలను ప్రారంభించిన నారా లోకేష్
  • చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా ముఖ్యమన్న మంత్రి
  • అన్ని వసతులు కల్పిస్తున్నామన్న లోకేష్

ఏపీలో ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. ఈరోజు అమరావతిలో 10 ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఐటీ కంపెనీలు ఎంత ముఖ్యమో చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తోందని చెప్పారు. రాయితీలను సకాలంలో ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలను రూపొందించామని చెప్పారు. ఐటీ రంగానికి అవసరమయ్యే విధంగా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. 

  • Loading...

More Telugu News