kanna: కాపులను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారు: కన్నా లక్ష్మీనారాయణ

  • ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు
  • ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు హామీలిస్తోంది
  • ఆ తర్వాత వాటి గురించి మర్చిపోతోంది

కాపులను చంద్రబాబునాయుడు పూర్తిగా మోసం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,1994లో కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకినని చెప్పిన చంద్రబాబు, 2014లో మాత్రం కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.

ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలప్పుడు హామీలిస్తూ, ఆ తర్వాత మర్చిపోతోందని విమర్శించారు. కాపులు, వడ్డెర్లు, బోయ తదితర కులస్తులకు హామీలు ఇచ్చి.. వాటిని ఆరునెలలలో అమలులో చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాట తప్పారని అన్నారు. బీసీలకు నష్టం చేయకుండా కాపు రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని లక్ష్మీనారాయణ మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News