Gun: తుపాకి పనిచేస్తుందని నిరూపించేందుకు మహిళను కాల్చిన ప్రబుద్ధుడు!

  • నిజమైన తుపాకి కాదన్న మహిళ
  • అప్పటికప్పుడే నిరూపించాలనుకున్న నిందితుడు
  • కాల్పుల్లో మహిళ మృతి

తన వద్ద ఉన్న తుపాకి నిజమైనదేనని నిరూపించేందుకు ఓ ప్రబుద్ధుడు మహిళను కాల్చి చంపాడు. ఢిల్లీ, షాదరాలోని దిల్సాద్ గార్డెన్‌లో జరిగిందీ ఘటన. నిందితుడు సన్నీ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఘటన జరిగినప్పుడు ఉషా వాళ్లింట్లో మద్యం మత్తులో ఉన్నానని తెలిపాడు. ఆ సమయంలో నిష్తీ అక్కడకు వచ్చిందని, తన చేతిలోని తుపాకి చూసి అది నిజమైనది కాదని చెప్పిందని పేర్కొన్నాడు. దీంతో, అది నిజమైన ఆయుధమేనని అప్పటికప్పుడే ఆమెను నమ్మించాలని భావించి కాల్చానని వివరించాడు. అయితే, తూటాలు ప్రమాదవశాత్తు ఉష కడుపులోకి చొచ్చుకెళ్లాయని పేర్కొన్నాడు.

స్వామి దయానంద్ ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో ఈ విషయం వెలుగుచూసింది. ముగ్గురు నలుగురు వ్యక్తులు అనారోగ్య సమస్యలతో బాధపడుతోందంటూ ఓ మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో గాయం ఉన్నట్టు గుర్తించారని పోలీసులు తెలిపారు. దీంతో దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News