Pawan Kalyan: చంద్రబాబుపై పవన్ సెటైర్

  • రాహుల్ కు బాబు కన్నుకొట్టి మనం ఒకటే అనగలరు! 
  • అమరావతి పెయింటింగ్స్ కే పరిమితమైంది
  • నిజమైన అమరావతిని మేము నిర్మిస్తాం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు’ను విజయవాడలో ఈ రోజు నిర్వహించిన సంగతి విదితమే. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కనిపిస్తే, ఆయనకు చంద్రబాబు కన్నుకొట్టి 'మనిద్దరం ఒకటే' అనగలరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం అమరావతి పెయింటింగ్స్ కే పరిమితమైందని, భవిష్యత్ లో ‘జనసేన’, వామపక్షాల సారథ్యంలో నిజమైన అమరావతిని నిర్మిస్తామని ధీమాగా చెప్పారు.  

  • Loading...

More Telugu News