srinivas: సెన్సార్ పూర్తి చేసుకున్న 'సాక్ష్యం' .. రేపు వచ్చేస్తోంది

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాక్ష్యం'
  • శ్రీనివాస్ జోడీగా పూజా హెగ్డే 
  • భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు      

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై .. శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' చిత్రం రూపొందింది. శ్రీనివాస్ .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. దాంతో ఈ సినిమా రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాస్తవానికి కొన్ని రోజులముందే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోవలసి వుంది. అయితే అనుమతులు లేకుండగా షూటింగులో జంతువులను .. పక్షులను ఉపయోగించారనే టాక్ వచ్చింది . ఈ కారణంగానే సెన్సార్ చేయడానికి అధికారులు నిరాకరించారని చెప్పుకున్నారు. విడుదల తేదీ వాయిదా పడే ఛాన్స్ లేకపోలేదనే ప్రచారం జరిగింది. వాటన్నింటికి తెరదించేస్తూ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. భారీ తారాగణంతో వస్తోన్న ఈ సినిమాకి భారీ విజయం దక్కుతుందనే నమ్మకంతో వున్నారు.  

  • Loading...

More Telugu News