paruchuri: వినాయక్ రాసిన ఆ డైలాగ్ విని ఉలిక్కిపడ్డాను: పరుచూరి గోపాలకృష్ణ

  • వినాయక్ 'చెన్నకేశవరెడ్డి' చేశాడు 
  • ఆ సినిమాకి మాటలు రాశాను 
  • ఒక డైలాగ్ మాత్రం వినాయక్ వేశాడు    

హీరోయిజాన్ని ఒక రేంజ్ లో బిల్డప్ చేస్తూ పవర్ఫుల్ డైలాగ్స్ రాయడంలో పరుచూరి బ్రదర్స్  సిద్ధహస్తులు. అందుకే యాక్షన్ సినిమాలు చేసే దర్శకులు పరుచూరి బ్రదర్స్ ను ఎక్కువగా సంప్రదిస్తుంటారు. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ .. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా తన అనుభవాలను కొన్ని పంచుకున్నారు.

'ఆది' సినిమా తరువాత వినాయక్ తో మేము చేసిన సినిమా 'చెన్నకేశవరెడ్డి'. ఈ సినిమాకి సంబంధించి ఒక వెర్షన్ రాసిచ్చేశాను .. ఆ తరువాత నా పనుల్లో బిజీ అయ్యాను. అప్పుడప్పుడు వినాయక్ వచ్చి ఒక సీన్ ఇస్తే .. అప్పటికప్పుడు రాసిస్తూ ఉండేవాడిని. ఈ సినిమా సెన్సార్ కి వెళ్లిన తరువాత నేను ఉలిక్కిపడేలా ఒక పని చేశాడితను.

ఈ సినిమాలో ఒక డైలాగ్ గురించి ఒక సెన్సార్ ఆఫీసర్ నా దగ్గర ప్రస్తావించాడు. విలన్ ఒక అమ్మాయిని పాడుచేసిన తరువాత ఒకమాట అంటాడు. ఆ మాట నేను రాయలేదు .. 'ఏవయ్యా వినాయక్ ఇలా చేశావ్?' అని అడిగాను. అందుకు అతను ఒక కారణం చెప్పాడు .. ఏదైతేనేం మొత్తానికి ఆ సినిమా కూడా బాగానే ఆడింది" అని చెప్పుకొచ్చారు.       

  • Loading...

More Telugu News