Chandrababu: చంద్రబాబు రాసిన లేఖను పైనా, కిందా వదిలేసి బీజేపీ నేతలు చదివారు: సీఎం రమేశ్

  • హోదాకు సమానంగా కేంద్రం ప్యాకేజ్ ఇస్తామంది
  • అప్పుడు, కేంద్రానికి చంద్రబాబు ఓ లేఖ రాశారు
  • ధన్యవాదాలూ చెప్పారు, చాలా విషయాలపై ప్రశ్నించారు కూడా! 

కేంద్రానికి సీఎం చంద్రబాబునాయుడు రాసిన లెటర్ లో పైనా కింద వదిలేసి బీజేపీ నేతలు చదివారని, ఇలా ఎక్కడైనా చదువుతారా? అని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రశ్నించారు. విభజన హామీలపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు సవ్యంగా లేదని అన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని.. దానికి సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు లేఖ రాశారని, ఆ లేఖలో ఎందుకు ఇవ్వలేరని ప్రశ్నించడంతో పాటు ఇంకా చాలా విషయాలున్నాయని అన్నారు. ఆ విషయాలన్నింటినీ వదిలేసి కేవలం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు చంద్రబాబు ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారని, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పడంలో అర్థం లేదని అన్నారు. జీవీఎల్ తాను తెలుగుబిడ్డ అని మాట్లాడారని, ఆయన తెలుగుబిడ్డ కాదని.. ఏపీలో ఎన్నడూ లేరని, ఆయనకు ఢిల్లీలో ఓటు, ఆధార్ కార్డు ఉన్నాయని విమర్శించారు.   

  • Loading...

More Telugu News