nirmalananda: ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద మృతి

  • హైదరాబాద్ లో రేపు ఆయన అంత్యక్రియలు
  • ముప్పై ఐదేళ్లుగా సాహితీ సేవలందించిన నిర్మలానంద
  • ఆయన మృతిపై పలువురు సంతాపం

హిందీ సహా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద (84) ఈరోజు మృతి చెందారు. హైదరాబాద్ లో రేపు ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని నిర్మలానంద కుటుంబసభ్యులు తెలిపారు. ముప్పై ఐదేళ్లుగా సాహితీ సేవలందించిన నిర్మలానంద మృతిపై జనసాహితి నేతలు కొత్తపల్లి రవిబాబు, దివికుమార్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, మహాకవి శ్రీశ్రీ రచించిన ‘మహాప్రస్థానం’ను హిందీలోకి నిర్మలానంద అనువదించారు.

  • Loading...

More Telugu News