Police: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోల మృతి

  • దంతెవాడ సరిహద్దులో ఎన్‌కౌంటర్
  • రెండు గంటలపాటు కొనసాగిన కాల్పులు
  • మృతుల్లో నలుగురు మహిళలు

మావోయిస్టులకు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం నుంచి గాలింపు మొదలు పెట్టారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో తిమినార్‌, పూసనార్‌ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళలు సహా ఎనిమిదిమంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News