nagarjuna: 'బ్రహ్మాస్త్రా'లో నాగార్జున సరసన డింపుల్ కపాడియా?

  • రణ్ బీర్ కపూర్ హీరోగా 'బ్రహ్మాస్త్రా'
  • కీలకమైన పాత్రలో అమితాబ్ 
  • ముఖ్యమైన పాత్రలో నాగార్జున

రణ్ బీర్ కపూర్ .. అలియా భట్ జంటగా 'బ్రహ్మాస్త్రా' సినిమాను అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. కొంతకాలం క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అమితాబ్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, మొదటి షెడ్యూల్ షూటింగు తాజాగా బల్గేరియాలో పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆయనకు జోడీగా ఇందులో డింపుల్ కపాడియా కనిపించనున్నట్టు సమాచారం. మూడేళ్ల గ్యాప్ తరువాత డింపుల్ చేసే సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

  • Loading...

More Telugu News