Uttar Pradesh: ఇంత మంది రోమియోలా?... యూపీలో 15 లక్షల మందికి కౌన్సెలింగ్, 4 వేల మంది అరెస్ట్!

  • గత సంవత్సరం ప్రారంభమైన 'యాంటీ రోమియో స్క్వాడ్'
  • మహిళలకు భద్రత కోసం మఫ్టీలో కెమెరాలతో నిఘా
  • అతిగా ప్రవర్తిస్తే అరెస్ట్: లక్నో ఏడీజీ ప్రవీణ్ కుమార్

ఉత్తర ప్రదేశ్ లో మహిళలకు మరింత భద్రత కల్పించాలన్న తలంపుతో గత సంవత్సరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన 'యాంటీ రోమియో స్క్వాడ్' ఇప్పటివరకూ 15 లక్షల మందికి కౌన్సెలింగ్ నిర్వహించిందని, 4 వేల మందిని అరెస్ట్ చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మహిళలకు భద్రతగా ఈ ప్రచారాన్ని ప్రారంభించామని, అతిగా ప్రవర్తించి, అమ్మాయిలను ఇబ్బందులు పెట్టిన 4 వేల మందికిపైగా యువకులను అరెస్ట్ చేశామని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం యాంటీ రోమియో స్క్వాడ్ లు పనిచేస్తున్నాయని లక్నో ఏడీజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ టీమ్ లు తిరుగుతూ ఉంటాయని, రహస్యంగా కెమెరాలు ధరించి మఫ్టీలో ఉండే వీరు, ఈవ్ టీజర్లు, బహిరంగ ప్రదేశాల్లో సమస్యలు సృష్టించే వారి చిత్రాలను బంధిస్తుంటారని తెలిపారు. ఈ టీమ్ లలో మహిళా పోలీసులు కూడా ఉన్నారని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీరు మహిళల భద్రతను రహస్యంగా పర్యవేక్షిస్తుంటారని చెప్పారు.

Uttar Pradesh
Anti Romio Squad
Lucknow
Praveen Kumar
Arrest
Councelling
  • Loading...

More Telugu News