Cricket: రెండో వన్డే: 3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌ యాదవ్‌

  • లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా రెండో వన్డే
  • ఇంగ్లండ్‌ స్కోరు 192/3 (32 ఓవర్లకి) 
  • అర్ధ శతకాలు చేసిన మోర్గాన్‌, జోయీ రూట్‌

లండన్‌లోని లార్డ్స్‌ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేస్తోన్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు రాణిస్తున్నారు. జేసన్‌ రాయ్‌ 4 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 40, జానీ బెయిర్‌స్టో 5 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 38 పరుగులు చేసి ఔట్‌ కాగా, మోర్గాన్‌ 4 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 53 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో జోయీ రూట్ 55, బెన్‌ స్టోక్స్‌ 2 పరుగులతో ఉన్నారు. కుల్దీప్‌ యాదవ్‌ కి 3 వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్‌ స్కోరు 192/3(32 ఓవర్లకి)గా ఉంది. 

  • Loading...

More Telugu News