husband: భార్య ప్రశ్నించిందని నరికి చంపిన భర్త!

  • అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో ఘటన
  • పనికి పోకుండా ఇంటిపట్టునే ఉన్న భర్తను ప్రశ్నించిన భార్య
  • గొడ్డలితో తల, మెడపై నరికిన భర్త

పనికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించిన భార్యను కిరాతకంగా నరికి చంపాడో భర్త. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలోని తమ్మేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, బోయ అక్కమ్మ, గంగాధర దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గంగాధర వారం రోజులుగా పనికి వెళ్లకుండా, మందు తాగుతూ ఇంటి పట్టునే ఉంటున్నాడు.

అక్కమ్మ పొలం పనులకు వెళ్లి వచ్చిన తర్వాత... భర్తను నిలదీసింది. పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటే జీవనం సాగించడం ఎలాగని ప్రశ్నించింది. దీంతో, ఆవేశానికి లోనైన గంగాధర పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని అక్కమ్మ తలపైన, మెడపైన నరికాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య విషయం తెలుసుకున్న సీఐ చలపతిరావు, ఎస్ఐ వెంకటరమణ ఘటనా స్థలికి వచ్చి గంగాధరను అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.

  • Loading...

More Telugu News