India: చివరి టీ20.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా!

  • బ్రిస్టల్‌ వేదికగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌
  • మొదటి మ్యాచ్‌ గెలిచి, రెండో మ్యాచ్‌ ఓడిన భారత్‌
  • కప్పు సాధించాలన్న పట్టుదలతో కోహ్లీ సేన

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా ఈరోజు మూడో టీ20 ఆడుతోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో గెలిచి రెండో దానిలో ఓడిన భారత్‌.. నిర్ణయాత్మక  మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కప్పు సాధించాలని పట్టుదలగా ఉంది. బ్రిస్టల్‌ వేదికగా జరుగుతోన్న చివరి టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టీమిండియాలో రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, లోకేశ్ రాహుల్, విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర ఛాహల్, సిద్ధార్థ్  కౌల్‌, దీపక్‌ ఛాహర్, ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నారు. 

  • Loading...

More Telugu News