Mahesh Babu: మహేశ్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో

  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ 
  • డెహ్రాడూన్ లో షూటింగ్ పూర్తి
  • రైతు సమస్యల నేపథ్యంలో కథ  

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'రాజసం' .. 'రైతుబిడ్డ' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా డెహ్రాడూన్ లో జరుగుతోంది. జూన్ 17వ తేదీన అక్కడ మొదలైన షెడ్యూల్ రీసెంట్ గా పూర్తయింది. దాంతో ఈ రోజు రాత్రికి ఈ సినిమా టీమ్ హైదరాబాద్ చేరుకోనుంది.

మహేశ్ బాబు .. పూజా హెగ్డేల కాంబినేషన్ లోని కొన్ని సన్నివేశాలను డెహ్రాడూన్లో చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. కొన్నిరోజుల విరామం తరువాత ఈ సినిమా టీమ్ అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, నాయకా నాయికల మధ్య రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతు సమస్యలపై పోరాడే యువకుడిగాను మహేశ్ బాబు కనిపించనున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తారు.         

  • Loading...

More Telugu News