High Court: ఉమ్మడి హైకోర్టు‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ ప్రమాణం!

  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ నరసింహన్
  • కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు హాజరు
  • గతంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్‌ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయనచే గవర్నర్‌ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మండలి చైర్మన్ స్వామి గౌడ్, హైకోర్టు న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, రాధాకృష్ణన్‌ 2017లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి అక్కడ 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు.

  • Loading...

More Telugu News