ntr: రాజమౌళి మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ అప్పటి నుంచే

  • రాజమౌళి నుంచి భారీ మల్టీ స్టారర్
  • భారీ సెట్స్ నిర్మాణం పనులు మొదలు 
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి  

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీస్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అనే ఆసక్తితో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఇటు చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం.

ముందుగా ఒక హీరోకి సంబంధించిన సన్నివేశాలను .. ఆ తరువాత మరో హీరోకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఆ తరువాత ఇద్దరు హీరోల కాంబినేషన్లోని సీన్స్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణకు అవసరమైన భారీ సెట్స్ నిర్మాణం మొదలైంది. నవంబర్ నుంచి ఎన్టీఆర్ .. డిసెంబర్ నుంచి చరణ్ ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఇక కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది చూడాలి.  

  • Loading...

More Telugu News