kanna: కన్నా తిరుపతి పర్యటనలో ఉద్రిక్తత

  • అన్నారావ్ సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించేందుకు యత్నం
  • అనుమతి లేకుండా జెండా దిమ్మెను నిర్మించడంపై అభ్యంతరం
  • అనుమతించని పోలీసులు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు తిరుపతిలో జరిపిన పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక కపిలతీర్థం రోడ్డులోని అన్నారావ్ సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించాలని స్థానిక నాయకుడు జెల్లి మధుసూదన్ ప్రయత్నించారు. అయితే, మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా జెండా దిమ్మెను నిర్మించడంతో ఈ కార్యక్రమానికి అర్బన్ పోలీసులు అనుమతించలేదు.

 పైగా, ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు అనుమతి తీసుకోకపోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు మద్దతు తెలపడానికి బయలుదేరిన కన్నా లక్ష్మీనారాయణను మున్సిపల్ ఆఫీసు వద్ద అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో, స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News