Chandrababu: చిత్తూరు డైరీని గాలికొదిలేసి ‘హెరిటేజ్’ ను అభివృద్ధి చేసుకుంటున్నారు: కన్నా ఆరోపణలు

  • చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి 
  • రైతులను పట్టించుకోకుండా హ్యాపీ సండే కార్యక్రమాలా?
  • ఏపీ అవినీతిలో కూరుకుపోయింది

చిత్తూరు డైరీని గాలికొదిలేసి..‘హెరిటేజ్’ ను అభివృద్ధి చేసుకుంటున్నారంటూ చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, రైతులను పట్టించుకోకుండా హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని అన్నారు.

చంద్రబాబు తన నయనవంచన దీక్షలు ఆపి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ అవినీతిలో కూరుకుపోయిందని, టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుమల అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై సరైన స్పష్టత లేనందున ముందుకు రాలేకపోతున్నామని, విశాఖ రైల్వేజోన్ అంశం పరిశీలిస్తున్నామని, దీనికి ఇంకా సమయం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News