Chandrababu: పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానంటూ చంద్రబాబు మరోసారి డ్రామాలాడుతున్నారు: ఎమ్మెల్యే రోజా

  • నాలుగేళ్లుగా గుర్తుకురాని పేదలు ఇప్పుడు గుర్తొచ్చారా?
  • ఆరు నెలల్లో 19 లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారు?
  • చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చిఅబద్ధాలే

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి డ్రామాలాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నిధులతో ఇళ్లు కట్టి..చంద్రబాబు సొంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయలు వెచ్చింది మూడు లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మించి, గృహప్రవేశాలు చేస్తున్నామని చాలా గొప్పగా చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 25 లక్షల మందికి ఇళ్లు కట్టాల్సి ఉండగా, కేవలం మూడు లక్షల మందికి ఇళ్లు కట్టారని, వాటిలో టీడీపీ నాయకులు, వాళ్ల బినామీలకే ఇచ్చారని ఆరోపించారు. నాలుగేళ్లుగా గుర్తుకురాని పేదలు చంద్రబాబుకు ఇప్పుడు గుర్తొచ్చారా? ఆరు నెలల్లో 19 లక్షల ఇళ్లు ఎలా కట్టిస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చిఅబద్ధాలని, వీటిని నమ్మొద్దని అన్నారు. ఇళ్ల నిర్మాణాల పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి చంద్రబాబు, మంత్రి నారాయణ యత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 

  • Loading...

More Telugu News