Janasena: జనసేనలో దాడి వీరభద్రరావు చేరిక ఖరారు.. సాదర ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పిన పవన్!

  • ఒకరినొకరు ప్రశంసించుకున్న దాడి-పవన్
  • దాడి లాంటి నేత ప్రజలకు అవసరమన్న పవన్
  • సినిమాల్లో కోట్ల రూపాయాలు వదులుకున్నారన్న దాడి

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు జనసేనలో చేరడం ఖరారైంది. ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలిపారు. సామాజిక స్పృహ కలిగిన ఆయన సేవలు ప్రజలకు ఎంతో అవసరమన్నారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. దాడి వీరభద్రరావు జన్మదినం సందర్భంగా అనకాపల్లిలోని స్థానిక పెదరామస్వామి కోవెలలో నిర్వహించిన వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

దాడి మాట్లాడుతూ.. పవన్ కుటుంబంతో తనకు చాలాకాలంగా అనుబంధం ఉందన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ప్రజాసేవ కోసం వచ్చిన పవన్‌‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు. పవన్ ఆహ్వానంపై మాట్లాడుతూ అభిమానులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. దేవాలయంలో కార్యక్రమం ముగిసిన అనంతరం దాడి ఇంటికి వెళ్లిన పవన్ ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కోసి, దాడికి తినిపించారు. అనంతరం వారి ఇంటిలోనే పవన్ భోజనం చేశారు.

  • Loading...

More Telugu News