kailash-mansarovar-yatra: కైలాస్‌ మానస సరోవర్‌కు వెళ్లిన యాత్రికుల ఇబ్బందులు.. ఆహారం కూడా దొరకని వైనం

  • విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లిన యాత్రికులు
  • భారత్‌, నేపాల్‌ సరిహద్దులో యాత్రికులు
  • ప్రతికూల వాతావరణం వల్ల నిలిచిన హెలికాప్టర్లు

కైలాస్‌ మానస సరోవర్‌కు వెళ్లిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వారిలో విజయవాడతో పాటు ఇతర తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లిన యాత్రికులు కూడా ఉన్నారు. ఇండియా, నేపాల్‌ సరిహద్దులో వారు మొన్నటి నుంచి అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్లు కూడా నిలిచిపోయాయి. దీంతో ఆహారం దొరక్క దాదాపు 1000 మంది యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారిలో కొందరు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.                                    

  • Loading...

More Telugu News