KTR: అదే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్

  • టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్ కు కట్టుబడి ఉన్నా
  • తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది మోసాల చరిత్ర
  • తెలంగాణను తెచ్చుకున్నది ప్రజలే

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంతో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారని... ఆయన మాట నిలబెట్టుకున్నా, నిలబెట్టుకోక పోయినా, తాను మాత్రం మాటపై నిలబడతానని చెప్పారు.

 సోనియాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టడంపై స్పందిస్తూ... తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది మోసాల చరిత్ర అని చెప్పారు. రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలేనని, విధిలేని పరిస్థితుల్లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. అందుకే తెలంగాణను ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు అని తాను వ్యాఖ్యానించానని తెలిపారు.

  • Loading...

More Telugu News