galla jayadev: ఇటువంటి వీడియోలు రానున్న రోజుల్లో ఇంకా వస్తాయి.. ఇవన్నీ కుట్రలో భాగం!: గల్లా జయదేవ్‌

  • ఇది వైసీపీ కుట్ర
  • అమిత్‌ షా చేసే రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి
  • ప్రసారం చేసే ముందు మీడియా నిర్ధారించుకోవాలి

ఢిల్లీలో ఓ గదిలో కూర్చున్న టీడీపీ ఎంపీలు 'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' అంటూ సరదాగా మాట్లాడుకుంటుండగా తీసిన వీడియో బయటకు రావడంతో విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ వీడియోపై టీడీపీ ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయంపై ట్వీట్‌ చేసిన ఎంపీ గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఆ వీడియోపై స్పందించారు.

రానున్న రోజుల్లో ఇటువంటి ఫేక్‌ వీడియోలు ఎక్కువవుతాయని, ఆ వీడియో బీజేపీ కుట్రలో భాగమని ఆయన అన్నారు. వైసీపీ, జనసేనలను బీజేపీ ఇటువంటి చర్యలకు ఉపయోగించుకుంటోందని అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చేసే రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయని అన్నారు. ఇటువంటివి ప్రసారం చేసే ముందు మీడియా నిర్ధారించుకోవాలని అన్నారు.           

  • Loading...

More Telugu News