balakrishna: పల్లెబాటలో జారిపోయిన బాలయ్య ఉంగరం.. గుర్తించి ఇచ్చిన మహిళ!

  • పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టిన బాలయ్య
  • నియోజకవర్గ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే
  • ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్న వైనం

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పల్లెబాట పట్టిన బాలయ్య... పల్లె నిద్రలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా అభిమానులు ఆయనకు కరచాలనం చేస్తున్న సందర్భంలో చేతి వేలుకు ఉన్న ఉంగరం పడిపోయింది. ఆ విషయాన్ని ఆయన కూడా గ్రహించలేదు. ఆ తర్వాత ఓ మహిళ కింద పడిపోయిన ఉంగరాన్ని గుర్తించి, తిరిగి బాలయ్య వేలికి తొడిగింది. ఆమె నిజాయతీకి బాలయ్య ఎంతో సంతోషపడ్డారు.

బాలయ్య చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ఆయన మమేకమై... వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News