cm ramesh: సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా డాక్టర్

  • విషమిస్తున్న సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి
  • వైద్య నివేదికను పరిశీలించిన యూఎస్ వైద్యుడు రాజా
  • గుండెకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉందన్న డాక్టర్

ఉక్కు పరిశ్రమ సాధన కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. రిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రిమ్స్ వైద్యుల నివేదికను అమెరికా నుంచి వచ్చిన వైద్యుడు డాక్టర్ రాజా పరిశీలించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం రమేష్ ఐసీయూలో ఉండాలని... ఆయనకు టెంట్ కింద వైద్య పరీక్షలు నిర్వహించడమేమిటని రాజా ప్రశ్నించారు. ఆయన గుండెకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని... ఏదైనా జరిగితే ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో... వైద్య బృందాన్ని దీక్షా శిబిరం వద్దే ఉంచుతున్నామని రిమ్స్ సూపరింటెండెంట్ గిరిధర్ తెలిపారు. మరోవైపు, సీఎం రమేష్ ను మంత్రి నారాయణ పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితి గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News