gopichand: అనుమానాలొద్దు .. 'పంతం' అదే రోజున వస్తుంది: నిర్మాత రాధామోహన్

  • చక్రి దర్శకత్వంలో గోపీచంద్ 
  • కథానాయికగా మెహ్రీన్ 
  • వచ్చేనెల 5వ తేదీన విడుదల   

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న గోపీచంద్, కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'పంతం' కథను ఓకే చేసి .. ఆ సినిమా షూటింగును పూర్తిచేశాడు. చక్రి దర్శకత్వంలో మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఆ మరుసటి రోజునే తేజు .. కల్యాణ్ దేవ్ సినిమాల విడుదల ఉండటంతో, 'పంతం' విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై ఈ సినిమా నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ .. "ఈ సినిమా విడుదల విషయంలో కొంతమందికి అనుమానాలు వున్నట్టుగా తెలుస్తోంది. బయట వినిపిస్తున్నట్టుగా విడుదల తేదీని ఎలాంటి పరిస్థితుల్లోను వాయిదా వేసే ఉద్దేశం లేదు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 21వ తేదీన విజయవాడలో నిర్వహిస్తాం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24వ తేదీన విశాఖలో జరపనున్నాం" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News