Chandrababu: ఏదో ఒక మాటపై చంద్రబాబు స్థిరంగా ఉంటే బాగుండేది!: ఉండవల్లి

  • హోదా లేక ప్యాకేజ్ కావాలో తేల్చుకోలేని స్థితిలో బాబు ఉన్నారు
  • ఏదో ఒక మాటపై చంద్రబాబు స్థిరంగా ఉంటే బాగుండేది
  • కేంద్రంపై తిరగబడాలని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పా

ఏదో ఒక మాటపై చంద్రబాబు స్థిరంగా ఉంటే బాగుండేదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా కావాలో, ప్యాకేజ్ కావాలో తేల్చుకోలేని స్థితిలో చంద్రబాబు ఉండిపోయారని, అందుకే, పలుసార్లు మాట మార్చారని విమర్శించారు.  

కేంద్రంపై తిరగబడాలని చంద్రబాబుకు ఎప్పుడో చెప్పానని, కానీ, ఆ పని చేయని చంద్రబాబు యాక్షన్ చేస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్, బీజేపీ లు నాడు కలిసే పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏ పార్టీపైనా తనకు శత్రుభావం లేదని చెప్పిన ఉండవల్లి, జనసేన పార్టీ నివేదికపై కూడా మాట్లాడారు. కేంద్రం నిధులు ఇచ్చామని, రాష్ట్రం ఇవ్వలేదని అంటున్న సందర్భంగా పవన్ కల్యాణ్ ఆ కమిటీ వేశారని, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఇంత రావాలని తేల్చారని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఇంతవరకూ స్పందించలేదని ఉండవల్లి అన్నారు. 

  • Loading...

More Telugu News