Mahesh Babu: డెహ్రాడూన్‌లో మ‌హేశ్‌ బాబుతో ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర‌ సింగ్ రావ‌త్ ముచ్చట్లు!

  • బయటకు వచ్చిన ఫొటో
  • మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం
  • టోపీ పెట్టుకుని గడ్డం, మీసాలతో మహేశ్‌

మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుద్దికుంటోన్న కొత్త సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌ సింగ్ రావ‌త్.. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతోన్న ప్రదేశానికి వచ్చి మహేశ్‌ బాబుని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో మహేశ్‌ బాబు టోపీ పెట్టుకుని మీసాలు, గెడ్డంతో కనపడుతున్నాడు. త్రివేంద్ర‌ సింగ్ రావ‌త్‌తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాగా, మహేశ్ బాబు స్టూడెంట్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

  • Loading...

More Telugu News