yanamala: ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబుపై కుట్ర జరుగుతోంది: మంత్రి యనమల

  • నీతి ఆయోగ్ సమావేశం అన్ని రాష్ట్రాలకు కీలకం
  • తనకు అనుకూలంగా ఉండే అజెండాను కేంద్రం ఖరారు చేసుకుంది
  • బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలనేది టీడీపీ నిర్ణయం

ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యే విషయం రేపటి పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ వెళ్లాలనేది పార్టీ నిర్ణయమని, అందుకు అనుగుణంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశం అన్ని రాష్ట్రాలకు కీలకమని, 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని మండిపడ్డారు.

 తనకు అనుకూలంగా ఉండేలా నీతి ఆయోగ్ సమావేశపు అజెండాను కేంద్రం ఖరారు చేసుకుందని, రాష్ట్రాల ప్రత్యేక పన్నుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ హోదాలో బీజేపీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏదైనా సమాచారం ఇచ్చారా? లేదా? అనేది ఆయనే నిరూపించుకోవాలని అన్నారు. బుగ్గన తన వద్ద ఉన్న సమాచారాన్ని బీజేపీకి అందించినట్టు తమకు తెలిసిందని అన్నారు. నియమాల ప్రకారం, ఈ విధంగా చేయడం తప్పేనని, ఇదే కనుక నిజమైతే ప్రివిలేజ్ మోషన్ తో పాటు ఎథిక్స్ కమిటీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని యనమల అన్నారు.

  • Loading...

More Telugu News