vajpayee: వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్‌ విడుదల

  • అనారోగ్యంతో బాధపడుతోన్న వాజ్‌పేయి
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
  • వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని వ్యాఖ్య

భారత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా బులిటెన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆయన పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కాగా, కిడ్నీ సంబంధిత సమస్య, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లతో వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరారు.  

  • Loading...

More Telugu News