kcr: మోదీతో భేటీ అయిన కేసీఆర్

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్
  • కాసేపటి క్రితం మోదీతో భేటీ
  • పలు అంశాలపై చర్చిస్తున్న పీఎం, సీఎం

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, కొత్త జోనల్ విధానం, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, హైకోర్టు విభజన, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దీనికి తోడు పంటకు మద్దతు ధర పెంచాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలని ప్రధానికి కేసీఆర్ విన్నవించనున్నారు.

  • Loading...

More Telugu News