vajpayee: ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని వాజ్ పేయి

  • రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరిన వాజ్ పేయి
  • డాక్టరు రణ్ దీప్ గులేరియా పర్యవేక్షణలో పరీక్షలు
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్ పేయి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని వాజ్ పేయిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. రొటీన్ చెకప్, పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారని అక్కడి వైద్యులు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ డాక్టరు రణ్ దీప్ గులేరియా పర్యవేక్షణలో వాజ్ పేయికి పరీక్షలు నిర్వహించనున్నారు.

కాగా, సుమారు మూడు దశాబ్దాలుగా వాజ్ పేయికి పర్సనల్ ఫిజీషియన్ గా రణ్ దీప్ వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 94 సంవత్సరాల వాజ్ పేయి మంచానికే పరిమితమయ్యారు. 

రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న వాజ్ పేయి 1924లో జన్మించారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. లక్నో లోక్ సభ స్థానం నుంచి 1991,1996,1998,1999, 2004 సంవత్సరాల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి వాజ్ పేయి. 2015లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఆయనకు లభించింది.

  • Loading...

More Telugu News