Mahesh Babu: 50 రోజులు పూర్తి .. 'బాహుబలి' తరువాత స్థానంలో 'భరత్ అనే నేను'

  • భారీ విజయాన్ని అందుకున్న 'భరత్ అనే నేను'
  • మహేశ్ కెరియర్లో 100 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమా 
  • శాటిలైట్ హక్కుల రూపంలో 22 కోట్లు  

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది. సందేశంతో కూడిన ఈ సినిమా .. మహేశ్ అభిమానులకు ఎంతో సంతృప్తిని కలిగించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇటు కొరటాల కెరియర్లోను .. అటు మహేశ్ బాబు కెరియర్లోను చెప్పుకోదగినదిగా నిలిచింది. 200 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా .. మహేశ్ బాబు కెరియర్లో 100 కోట్ల షేర్ ను రాబట్టిన తొలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఛానల్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 22 కోట్లకి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు అత్యధిక రేటుకు అమ్ముడైన విషయంలో 'బాహుబలి' తరువాత స్థానంలో 'భరత్ అనే నేను' నిలిచింది. కథాకథనాలు .. కొరటాల - మహేశ్ కాంబినేషన్ .. మహేశ్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ .. సంగీత సాహిత్యాలు ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తీసుకొచ్చాయనే మాట వాస్తవం.   

  • Loading...

More Telugu News