kohli: అభిమానుల అత్యుత్సాహంతో దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం

  • ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ కు పోటెత్తిన కోహ్లీ అభిమానులు
  • కోహ్లీ మైనపు విగ్రహంతో సెల్ఫీలకు ఎగబడ్డ ఫ్యాన్స్ 
  • విగ్రహం కుడిచెవి పైభాగం విరిగిపోయిన వైనం

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ లో నిన్న ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిని చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో మైనపు విగ్రహం దెబ్బతింది.  సెల్పీలు తీసుకునే అభిమానుల అత్యుత్సాహం కారణంగా కోహ్లీ విగ్రహం కుడి చెవి పైభాగం విరిగిపోయింది.

వెంటనే స్పందించిన మ్యూజియం అధికారులు ఈ విగ్రహాన్ని సరిచేసే నిమిత్తం తమ వర్క్ షాపుకు తరలించారు. కాగా, ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించిన టీమిండియా క్రికెటర్లలో కోహ్లీ మూడో వ్యక్తి. అంతకుముందు, దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ కు ఈ గౌరవం దక్కింది.  

  • Loading...

More Telugu News