keerthi suresh: 'మహానటి'కి 26 రోజులు .. 26 కోట్ల షేర్!

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి'
  • ప్రధానమైన పాత్రలో కీర్తి సురేశ్ 
  • విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. ఈ సినిమా విడుదలైన 26 రోజుల్లో 26 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయడం విశేషం. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. సావిత్రి జీవితంలోని విషాద సంఘటనలు .. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులను గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపడం .. సీనియర్ నటీనటులతో పాటు, క్రేజ్ వున్న ఈ తరం నటీనటులు నటించడం .. నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభ ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించాయి. 'మహానటి' తరువాత చెప్పుకోదగిన సినిమా విడుదల కాకపోవడం కూడా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి మరో కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      

  • Loading...

More Telugu News