Hyderabad: 'నీట్'లో ర్యాంకు రాలేదన్న బాధతోనే.. అబిడ్స్ లో ఆ అమ్మాయి ఆత్మహత్య!

  • మయూరీ కాంప్లెక్స్‌ పదో అంతస్తు నుంచి దూకిన యువతి
  • బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ (18)గా గుర్తింపు
  • నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో ఆత్మహత్య

హైదరాబాద్‌ అబిడ్స్‌లోని మయూరీ కాంప్లెక్స్‌ పదో అంతస్తు నుంచి దూకి ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శవపరీక్ష నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకీ ఘటనకు పాల్పడిందన్న విషయాలను గుర్తించారు. మృతురాలు హైదరాబాద్‌లోని బర్కత్‌పురాకు చెందిన జస్లిన్‌ కౌర్‌ (18) అని తెలిపారు. నిన్న విడుదలైన నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి అబిడ్స్‌కు వచ్చి ఈ ఘటనకు పాల్పడిందని వివరించారు.

  • Loading...

More Telugu News