chiranjeevi: బ్రిటిష్ సైన్యంపై దాడి చేయనున్న 'సైరా'.. యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ!

  • చిరంజీవి హీరోగా సెట్స్ పై 'సైరా'
  • యాక్షన్ ఎపిసోడ్ కి సన్నాహాలు 
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు  

చిరంజీవి 151వ సినిమాగా .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను చరణ్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలో మొదలుపెట్టనున్న షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారట.

బ్రిటీష్ సైన్యంపై 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' దాడి చేసే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాలను ఉత్కంఠభరితంగా .. అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించనున్నారట. బ్రిటీష్ సైనికులతో నరసింహా రెడ్డి తలపడే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొదట ఈ యాక్షన్ సీన్ ను విదేశాల్లో చిత్రీకరించాలని భావించారు. అయితే కొన్ని కారణాల వలన హైదరాబాద్ లోనే చిత్రీకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.               

  • Loading...

More Telugu News