aadi pinisetty: నాని చేతుల మీదుగా 'నీవెవరో' టైటిల్ లాంచ్

  • ఆది పినిశెట్టి హీరోగా 'నీవెవరో'
  • కథానాయికలుగా  తాప్సీ .. రితికా సింగ్
  • త్వరలోనే ఇతర వివరాలు

తెలుగు .. తమిళ భాషల్లో హీరోగా ఆది పినిశెట్టి కొన్ని సినిమాలు చేశాడు. ఆ తరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రల్లోనూ మెప్పిస్తూ వస్తున్నాడు. మళ్లీ హీరోగా తెరపై కనిపించే అవకాశం తెలుగులో ఆయనకి వచ్చింది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. ఎమ్ వీవీ సినిమాస్ వారు నిర్మిస్తోన్న ఒక సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఆయన జోడీగా తాప్సీ .. రితికా సింగ్ నటించనున్నారు. తాజాగా ఈ సినిమాకి 'నీవెవరో' టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను వదిలారు. నాని చేతుల మీదుగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా నాని ఈ సినిమా టీమ్ కి 'ఆల్ ది బెస్ట్' చెప్పాడు. టైటిల్ ను బట్టి చూస్తుంటే ఇదొక థ్రిల్లర్ మూవీలా అనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   

aadi pinisetty
tapsee
  • Error fetching data: Network response was not ok

More Telugu News