YSRCP: ఏడుకొండలవాడా.. వైసీపీ నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి!: బుద్దా వెంకన్న

  • తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిపైనా రాజకీయాలు చేస్తున్నారు!
  • ఉమ్మడి ఏపీలో దండుపాళ్యం గ్యాంగ్..లక్ష కోట్లు దోచుకుంది 
  • ఈ గ్యాంగ్ లో ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి
  • ఈ స్టోరీనే కర్ణాటకలో సినిమాగా తీశారు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నగలు మాయమయ్యాయంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు ఏడుకొండలవాడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ మేరకు విజయవాడలో అర్బన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి లబ్బీపేట వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు నిరసన యాత్ర చేపట్టారు.

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిపై కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దండుపాళ్యం గ్యాంగ్..లక్ష కోట్లు దోచుకుందంటూ వైసీపీ అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ఈ గ్యాంగ్ లో ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి ఉన్నారని, ఈ స్టోరీనే కర్ణాటకలో సినిమాగా తీశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దోచుకున్న డబ్బుతో ఒక పార్టీని స్థాపించి, ఒక వ్యవస్థగా మారుదామని, తమ గ్యాంగ్ ను ఇంకా విస్తరిద్దామనే ఉద్దేశంతో ఏపీలో ఒక పార్టీని కూడా స్థాపించారని ఆరో్పించారు. కులాలు, మతాల మధ్య ఈ పార్టీ చిచ్చుపెడుతోందని, మోదీ, అమిత్ షా డైరెక్షన్ లో రాజకీయాలు చేస్తే ఇక్కడి ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News