Karnataka: జేడీఎస్‌తో కలవడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి: కర్ణాటక పీసీసీ చీఫ్

  • జేడీఎస్‌తో పొత్తు పెద్దల నిర్ణయం
  • దానికి కట్టుబడి ఉండాల్సిందే
  • మున్ముందు మాకు కష్టకాలమే

కర్ణాటకలో తాము జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ జి.పరమేశ్వర అన్నారు. రాష్ట్రంలో ఇక తమకు కష్టకాలం మొదలు కాబోతోందని వ్యాఖ్యానించారు. జేడీఎస్‌తో పొత్తు వల్ల చాలామంది బాధపడ్డారని, ఆ విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. దక్షిణాదిన బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ఒక్క ఉద్దేశంతోనే జేడీఎస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అందరూ తలొగ్గాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కష్టకాలం మొదలవుతుందని, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని పరమేశ్వర వివరించారు.

  • Loading...

More Telugu News